రణ్బీర్ తో సీన్స్ తీయలేదట!
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో ఒకటైన రామాయణ(ramayana)పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. రణ్బీర్ కపూర్(ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తుండగా, డైరెక్టర్ నితేష్ తివారీ(nitesh tiwari) ఈ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి స్పందన తెచ్చుకోవడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ గ్లోబల్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమోషన్స్ను విస్తరిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యష్(Yash) తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ మూవీ రివ్యూ ప్లాట్ఫారమ్ రోట్టెన్ టొమాటోస్(Rotten tomotoes) తో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు తనకు మరియు రణబీర్ కపూర్కు మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్స్ షూట్ చేయలేదని వెల్లడించారు. ఈ రెండు పాత్రలు వేర్వేరు రాజ్యాలలో ఉండటం వల్ల మొదటి దశలో వారి ట్రాక్లు విడిగా నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ ఇద్దరు పాత్రల మధ్య వచ్చే ఎదురుకాల్పులు సినిమాకే హైలైట్ అవుతాయని యష్ చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది. సెట్స్లో రణబీర్తో కలిసినప్పుడు మంచి అనుభవం కలిగిందని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ భారీ సినిమాలో రామరావణ యుద్ధం ఎలా చూపిస్తారో అన్న దానిపై ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి








