ఈ నెల 28న హైదరాబాద్ లో ఐఫా
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమి(ఐఫా)ఉత్సవాన్ని ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఐఫా రెండో ఎడిషన్లో భాగంగా భారతీయ సినిమాలకు అవార్డుల ప్రధానం చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలకు ఇందులో అత్యధిక స్థానం ఇస్తారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, మహేష్ బాబు, శివరాజ్ కుమార్, రవి చంద్రన్, తమన్నా, సమంత, అనుష్క, రకుల్, రాధిక, సూర్య, కార్తీక్ వంటి తమిళ్, తెలుగు మలయాళం, కన్నడ చిత్రసీమ నటులంతా హాజరుకానున్నారు. ఈ కార్యాక్రమానికి రానా, నవీన్ బాబు హోస్టిర్స్గా వ్యవహరించనున్నారు.













