మేక్ ఏ విష్ ఇండియా ద్వారా చిన్నారి శ్రద్ధాను ప్రత్యేకంగా కలిసి ఆమెతో మాట్లాడిన అల్లు అర్జున్
ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఉన్న అభిమాన గణం గురించి తెలిసిందే. ఆయన తన వినయంతో అభిమానులపై చూపించే ప్రేమతో అందరి ప్రేమను గెలుచుకున్నారు. తన అభిమానుల్లో పిల్లలపై ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. సిల్వర్ స్క్రీన్పై అందరినీ మెప్పించే ఈ స్టార్ హీరో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు కూడా ఆయన మద్ధతునిచ్చి అందరికీ ఆనంద క్షణాలను పంచుతుంటారు.
అలాంటి చిన్నారి అభిమానుల్లో చిన్నారి శ్రద్ధ కూడా ఒకటి. ఆమెకు ఎప్పటి నుంచో తన అభిమాన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలనే కోరిక. ఆమె కోరికను తెలుసుకున్న మేక్ ఏ విష్ ఇండియా చేసిన ప్రయత్నాలు.. అల్లు అర్జున్ చూపించిన ఆత్మీయ సహకారంతో ఆ చిన్నారి కల నిజమైంది. ప్రియమైన అభిమాని కోసం ఐకాన్ స్టార్ చేసిన చిన్న ప్రయత్నం..ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించగలదని, అలాగే ఆశను నింపగలదని ఇది మరోసారి నిరూపించింది.
శ్రద్ధ కోసం అల్లు అర్జున్ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఆత్మీయంగా మాట్లాడారు. ఇది ఆమెకు ఎంతో ప్రత్యేకమైన, అనిర్వచనీయమైన అనుభూతులను మిగిల్చిన క్షణాలుగా మారాయి. ఈ సందర్భంగా అత్యంత మధురమైన క్షణాల్లో ఒకటి ఏమిటంటే, శ్రద్ధ ఉత్సాహంగా “జుకేగా నహీ సాలా” అనే పుష్పా డైలాగ్ను మళ్లీ చెప్పడం. అది చూసి అల్లు అర్జున్ ఆనందంతో ఆశ్చర్యపోయారు. నవ్వులు, ఆనందం, ఆప్యాయతతో నిండిపోయి, తన అభిమాన హీరోను కలిసినప్పుడు శ్రద్ధ అనుభవించిన సంతోషాన్ని ఇది అద్భుతంగా ఆవిష్కరించిందనే చెప్పాలి.
ఒక అడుగు ముందుకేసి, అల్లు అర్జున్ శ్రద్ధను హైదరాబాద్కు వచ్చి ప్రత్యక్షంగా కలవాలని ఆహ్వానించారు. దీంతో ఈ కలయిక మరింత ప్రత్యేకంగా, మరపురానిదిగా మారింది. వారి సంభాషణలో ఆమె భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగినప్పుడు, శ్రద్ధ ఎంతో ధైర్యంగా తాను డాక్టర్ కావాలని కలగంటున్నానని తెలిపింది. దీంతో ఆమెకు అల్లు అర్జున్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమె ఆనందాన్ని మరింత పెంచడంతో పాటు, తన కలపై నమ్మకాన్ని మరింత పెంచింది.
శ్రద్ధను అల్లు అర్జున్ ప్రత్యేకంగా కలవటం ఆయనకు అభిమానులతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. ఇవన్నీ సూపర్స్టార్గా ఉన్న ఆయనలోని మనసున్న మనిషి వైపు మరోసారి ఆవిష్కరిస్తున్నాయి.








