పీకే లేకపోయినా.. ఐ-ప్యాక్ ను మమత ఎందుకు అంత నమ్ముకున్నారు?
బెంగాల్ ఎన్నికలు అనగానే మమతా బెనర్జీ, బీజేపీ ఎంత గుర్తుకు వస్తున్నాయో.. అదే రీతిలో ఐ- ప్యాక్ అనే సంస్థ కూడా తెరపైకి వస్తోంది. దాని చుట్టు కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ సంస్థ తన కార్యకలాపాలను నిలిపిసేందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేస్తున్నారు. అయితే సంస్థ తన పనితీరులో సమూల మార్పులు చేసేసింది. వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రకటించి, సంభాషణల విషయంలోనూ జాగ్రత్తగా వుండాలని సూచించింది.
I-PAC పాత్రకు సంబంధించి రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. I-PACలోని పలు విభాగాలను తక్షణమే ‘వర్క్-ఫ్రమ్-హోమ్’ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు. సరిగ్గా మూడు రోజుల ముందు సంస్థ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాకుండా బయటి వ్యక్తులతో సంభాషణలు జరిపే సమయంలో అధికారిక ఈమెయిల్ ఐడీలను వాడొద్దని సంస్థ తన ఉద్యోగులకు చెప్పేసింది.
వాస్తవానికి, I-PAC తన ఉద్యోగులను పనులను నిలిపివేసి, 20 రోజుల పాటు సెలవుపై వెళ్లాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కార్యకలాపాలు మే 11 వరకు నిలిపివేయబడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే, TMC ఈ వాదనలను నిరాధారమైనవిగా కొట్టివేసింది; రాష్ట్రంలో I-PAC బృందం పూర్తి స్థాయిలో చురుకుగా పనిచేస్తోందని స్పష్టం చేసింది.
TMC ప్రకారం, ఎన్నికల ప్రచారం తాము రూపొందించుకున్న వ్యూహానికి అనుగుణంగానే సాగుతోంది. BJPని లక్ష్యంగా చేసుకుంటూ, పశ్చిమ బెంగాల్ ప్రజలు తప్పుడు ప్రచారాలకు గానీ, ఒత్తిళ్లకు గానీ లొంగిపోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రజలు తమ తీర్పును వెలువరిస్తారని, ఆ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని ఆ పార్టీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ప్రశాంత్ కిశోర్ వైదొలిగినా… ఐ ప్యాక్ ను నమ్ముకున్న సీఎం మమతా
వాస్తవానికి ఐ ప్యాక్ స్థాపించింది ప్రశాంత్ కిశోర్. కానీ.. ఆయన ఇప్పుడు దానిని విడిచిపెట్టేశారు. కానీ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఆ సంస్థనే నమ్ముకుని, రాజకీయాలు చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఐ-పాక్ నుండి తప్పుకున్నప్పటికీ, ఆ సంస్థలో ఆయన నిర్మించిన డేటా ఆధారిత విశ్లేషణ వ్యవస్థ అలాగే ఉంది. ఐ-పాక్ కేవలం ఒక వ్యక్తి మీద ఆధారపడిన సంస్థ కాదు. ఇందులో ఐఐటి (IIT), ఐఐఎం (IIM) గ్రాడ్యుయేట్లు, డేటా సైంటిస్టులు , క్షేత్రస్థాయి పరిశోధకులు పనిచేస్తున్నారు. మమతా బెనర్జీకి కావలసింది ప్రశాంత్ కిషోర్ సలహాలు మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజల నాడిని పట్టే ఐ-పాక్ యంత్రాంగం. అందుకే పీకే లేకపోయినా, ప్రతీక్ జైన్ వంటి వంటి వారి నాయకత్వంలో నడుస్తున్న ఈ వ్యవస్థను ఆమె కొనసాగిస్తున్నారని పార్టీ ముఖ్యులు అంటున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతే కాకుండా ప్రశాంత్ కిశోర్ స్వయానా క్షేత్ర స్థాయిలో ఆ ఉద్యోగులను పంపేవారు. స్వయంగా క్షేత్రంలో ఎలా పర్యటించాలి? ప్రజల పల్స్ ని ఎలా రాబట్టాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఏ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకునికైనా ఐ ప్యాక్ పనిచేసినా.. పీకే పూర్తి క్షేత్ర స్థాయిలో దిగేవారు. ఇప్పటికి కూడా అదే విధంగా ఐ ప్యాక్ పనిచేస్తోంది. అత్యంత నిష్పక్షపాతంగా సీఎం మమతకు నివేదికలు ఇస్తుంటారని సమాచారం. అందుకే మమతా ఈ సంస్థను అంతగా చేరదీసిందని అంటారు.
మమతా బెనర్జీ వారసుడిగా ఎదుగుతున్న అభిషేక్ బెనర్జీకి, ఐ-పాక్ బృందానికి మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని ఆధునీకరించడంలో, పాత తరం నాయకులను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో అభిషేక్-ఐపాక్ జోడీ కీలకంగా వ్యవహరించింది.
ఇవి కూడా చదవండి








