శబ్దం నిశ్శబ్దంగా మారిన క్షణం!
భారత రాజధాని ఇంద్రప్రస్థ నగరం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 365వ మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ & హీలింగ్ కచేరీలో, సంగీతం ప్రదర్శనను దాటి, సాక్షాత్కారంగా మారింది.
పద్మ భూషణ్ పండిట్ ఛన్నులాల్ మిశ్రా గారి కుమారుడు, బనారస్ ఘరానాకు చెందిన ప్రసిద్ధ తబలా విద్వాంసుడు పండిట్ రామ్కుమార్ మిశ్రా గారు, అదేవిధంగా లెజెండరీ డా. ఎల్. సుబ్రహ్మణ్యం గారు వైలిన్పై , పూజ్య శ్రీ స్వామీజీ వారితో కలిసి ఒక అద్భుతమైన సంగీత సాయంత్రాన్ని నెరిపారు—అక్కడ శబ్దం మెల్లగా నిశ్శబ్దంలో లీనమైంది.
స్వరాలు కేవలం ప్రవహించలేదు—మనసును ప్రశాంతపరిచాయి.
తాళం కేవలం కదలలేదు—మన అంతరంగాన్ని సమతుల్యం చేసింది.
ఇవి కూడా చదవండి
కొన్ని క్షణాల పాటు, ప్రపంచం వెనుకకు వెళ్లిపోయింది, మిగిలింది ఒక్కటే—నాదబ్రహ్మ: పూజ్య శ్రీ స్వామీజీ, సమస్త సృష్టి ఒక నాదమనే నిశ్శబ్ద సత్యం, ఆ సమన్వయం మనలోనే ఆవిష్క్రతమైంది. ముగియని ఒక సాయంత్రం—మనలోనే స్థిరపడిపోయింది.
ఆధ్యాత్మిక సాయంత్రం….
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సంగీత పరిమళం నాదామృతమై వెల్లివిరిసింది తనువు మనసులను పులకింపచేసింది.
…. జై గురుదత్త….🙏
చెన్నూరి సుబ్బారావు
