Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష

ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్న సీఎం. పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ఆశిస్తున్న ప్రభుత్వం.
గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ఆదేశించిన సీఎం. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్న సీఎం. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 23న సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు. మేడారం జాతర పనులపై 23 న మేడారంలో సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి.