MLA Bathula: కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి .. సీఎంకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే

తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Lakshma Reddy) , ఆయన కుటుంబసభ్యులు విరాళం అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్మారెడ్డి కలిసి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా (Urea) బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు.ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడ (Miryalaguda) లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్ (Reception) ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం అభినందించారు.