తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక!
భారత్, పాకిస్థాన్కు ప్రయాణించాలనుకుంటున్న తమ దేశ పౌరులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నేరాలు, ఉగ్రవాదం, కరోనా వంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్, పాక్కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచించు కోవాలని కోరింది. భారత్లో ఉగ్రవాదం, మతపరమైన హింస వంటివాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని భారత్కు వెళ్లే తమ పౌరులకు అమెరికా సూచించింది. ఉగ్రవాదం, పౌర అసమ్మతి ఎక్కువగా ఉన్న కారణంగా జమ్ము కాశ్మీర్కు వెళ్లొదని, యుద్ధవాతావరణానికి అవకాశం ఉన్నందున భారత్, పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధి లోపు ప్రయాణించవద్దని తమ పౌరులకు సలహా ఇచ్చింది. భారత్లో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ఒకటని నివేదికలు చెబుతున్నారు. పర్యాటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.






