Minister Kondapalli: ఎంఎస్ఎంఈలకు జర్మనీ సహకారం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) తెలిపారు. చెన్నైలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 59వ వార్షిక ప్రాంతీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండో` జర్మన్ (German) సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందంపై ఇరుపక్షాల అధికారులు సంతకం చేశారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రెడీ టు ఇన్స్టాల్ పద్దతిలో పారిశ్రామిక పార్క్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తల (Industrialists) కు రాష్ట్రం స్వాగతం పలుకుతోందన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఎంఎస్ఎంఈ (MSME) లకు సంబంధించి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎగుమతులపై అవగాహన, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వాడులకో ఉన్న వస్తువుల తయారీ, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎంఎస్ఎంఈ పార్క్ లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పన సహా పలు అంశాలపై జర్మనీ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది.






