Janasena: జనసేన పార్టీ కీలక నిర్ణయం
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అంశంలో జనసేన పార్టీ (Janasena Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) పై ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి.శివశంకర్ (T. Sivashankar), తంబళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ (T.C. Varun) ఉన్నారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.






