MGBS: ఎంజీబీఎస్కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవే

మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంబీజీఎస్ (MGBS) ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ప్రయాణికులకు సూచనలిచ్చారు. ఈ రోజు ప్రయాణికులు ఎంజీబీఎస్కు రావొద్దని పేర్కొన్నారు. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ (JBS) నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ (Uppal Cross Roads) నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ (LB Nagar) నుంచి నడుస్తున్నాయి. మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. పొరపాటున ఎంజీబీఎస్కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్నీ లోకల్ బస్సులు అందుబాటులో ఉంచాం. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజీబీఎస్కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి అని తెలిపారు.