MGBS:ఎంజీబీఎస్కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. మూసీ పరీవాహకంలో వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం సమీక్షించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని సూచించారు. బతుకమ్మ(Bathukamma) ,దసరా (Dussehra) పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఇవాళ కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని పేర్కొన్నారు.