‘భారత్ ఫోర్జ్ లిమిటెడ్’ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ కళ్యాణితో కేటీఆర్ భేటీ
ఇండియన్ మల్టినేషనల్ కంపెనీ ‘భారత్ ఫోర్జ్ లిమిటెడ్’ ప్రతినిధి బృందం తమ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ కళ్యాణి నేతృత్వంలో దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. తెలంగాణలో భారత్ ఫోర్జ్ పెట్టుబడి అవకాశాలపై వారు చర్చించారు. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ – ఫోర్జింగ్, ఆటోమోటివ్స్, ఎనర్జీ, కన్ స్ట్రక్షన్ అండ్ మైనింగ్, రైల్వేస్, మెరైన్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో కార్యకలాపాలు చేపడుతుంది.
