7 జోన్లుగా తెలంగాణ : కేసీఆర్
తెలంగాణలో కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్ర ఆవిర్భావంతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జోనల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా ఈ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలను ఏడు జోన్లుగా, జోన్లను రెండు మల్టీ జోన్లుగా విభజించారు.
కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా) : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
బాసర జోన్ ( 39.74 లక్షల జనాభా) : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
రాజన్న జోన్ ( 43.09 లక్షల జనాభా) కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్ ( 50.44 లక్షల జనాభా ) కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
యాదాద్రి జోన్ ( 45.23 లక్షల జనాభా) సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగామ
చార్మినార్ జోన్ (1.03 కోట్ల జనాభా) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ జోన్ ( 44.63 లక్షల జనాభా) మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, వికారాబాద్
మల్టీజోన్లు :-
మల్టీజోన్ 1 (1.61 కోట్ల జనాభా) కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
మల్లీజోన్ 2 (1.88 కోట్ల జనాభా) యాదాద్రి,చార్మినార్, జోగులాంబ






