China: చైనా డ్రోన్ వ్యూహం.. భారత్ కు ఇబ్బంది తప్పదా…?
డ్రాగన్ మరోసారి తోక జాడిస్తోంది. ఇప్పుడిప్పుడే సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో.. ఒక్కసారిగా చైనా మిలియన్ డ్రోన్లకు(Million drones) ఆర్డరిచ్చిందన్న వార్తలు.. భారత్ ను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే చైనా తీసుకునే డ్రోన్లలో కొన్ని మిత్రుడైన పాకిస్తాన్ కు సరఫరా చేస్తుంది. అంటే మళ్లీ భారత్ -పాక్, భారత్-చైనా సరిహద్దుల్లో డ్రోన్ల విహారం పెరిగిపోతుందన్న మాట. దీంతో మళ్లీ టెర్రరిజం, డ్రగ్స్.. భారత మెడకు గట్టిగా చిక్కుకోనున్నాయి.
చైనా తన బుద్ధి కుక్కతోక చందమే అని మరోమారు నిరూపించుకుంది. యుద్ధాల్లో డ్రోన్ల వాడకం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి 10 లక్షల డ్రోన్లను సమకూర్చుకునేందుకు డ్రాగన్ దేశం సిద్ధమైంది. ఈమేరకు చైనాడ్రోన్ తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఏఐ(Artificial Intelligence) ఆధారిత తేలికపారి కమికాజ్ డ్రోన్లను చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వెంట మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే భారత్కు పెను సవాల్గా మారనుంది.
ఈ ఏఐ కామికేజ్ డ్రోన్లు 8 గంటలపాటు(8 hours) ఆకాశంలో ఎగరగలవు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ నుంచి తప్పించుకునే సామర్థ్యం వీటికి ఉంది. ఒక్కసారి లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే సమూహ దాడులు కూడా చేస్తాయి. ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించేలా రూపొందించబడ్డాయి. భారత్ ఇప్పటికే ఎన్ఏసీ వద్ద లేజర్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటరాక్షన్ సిస్టమ్స్ మోహరించింది.
భారత్–చైనా మధ్య మూడేళ్లుగా సఖ్యత చెడిపోయింది. గాల్వన్ ఘటన తర్వాత భారత్ చైనాతో అమీతుమీకి సిద్ధమైంది. గాల్వన్ ఘటనలో ఇరువైపులా భారీగానే నష్టం జరిగింది. కానీ చైనా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఘటన తర్వాత ప్రతీ భారతీయుడు కూడా చైనా ఉత్పత్తులు వాడడానికి విముఖత చూపాడు. దీనికి తోడు కేంద్రం .. చైనా ఉత్పత్తులపై సుంఖం పెంచింది. నిషేధం విధించింది. చైనా యాప్స్ బ్యాన్ చేసింది. దీంతో చైనాకు వేల కోట్ల నష్టం జరిగింది. మరోవైపు చైనా తరచూ సరిహద్దులు మారుస్తూ కవ్వింపులకు దిగుతోంది. కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్ సరిహద్దు వెంట బలగాలను మోహరించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగి శిఖరాగ్ర సదస్సులో చైనా భారత్ మధ్య సయోధ్య కుదిరింది. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు తగ్గించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా బలగాల ఉపసహరణకు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వారం రోజుల్లో సైనికుల ఉప సంహరణ కూడా పూర్తయింది.






