యాగానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం రెండోరోజు చేరింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ యాగానికి హాజరయ్యారు. యాగశాల వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు స్వాగతం పలికారు.
