వైభవంగా రెండో రోజు చండీయాగం
మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో రెండో రోజు అయుత చండీయాగం వైభవోపేతంగా సాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ రంగు దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రుత్విజులు కూడా గులాబీ రంగు దుస్తుల్లో పూజా కార్యక్రమాలు మహోన్నతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తులను పలకరించారు. చండీయాగంలో పాలు పంచుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నవరాణ పూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, ఏకదశన్యాస పూజలు నిర్వహించారు.
