Apache Helicopters : అమెరికా నుంచి భారత్కు అపాచీ ఆగయా

భారత సైనిక పోరాట సామర్థ్యానికి సానబెడుతూ మూడు అపాచీ పోరాట హెలికాప్టర్లు(Apache Helicopters) మన దేశానికి చేరాయి. ఇది దేశ రక్షణ సత్తాను బలోపేతం చేసే దిశగా ముందడుగు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. మొత్తం ఆరు అపాచీ ఏహెచ్-64ఈల కొనుగోలుకు భారత్ (India), అమెరికా (America)కు చెందిన బోయింగ్ (Boeing) సంస్థతో రూ.4,168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిగిలిన మూడు ఈ ఏడాది చివరిలోగా అందుతాయి. ఆధునిక క్షిపణులు, రాకెట్లతో కూడిన ఈ లోహవిహంగం ప్రతికూల ప్రాంతాల్లో భారత సైన్యంలోని విమానయాన విభాగం సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.