చీపురుపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియోన్లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.