ఢిల్లీ సీఎంకు సుప్రీంలో ఊరట

పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబందించి కింద కోర్టులో స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ వీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇది 2018 నాటి కేసు. అప్పుడు అప్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఆదేశాలతో వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మంది ఓటర్ల పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. దీనిపై కమలం పార్టీనేత రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలతో తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందన్నారు.