రిలయన్స్ భారీ షాక్… అమెజాన్ కు అనుకూలం
రిలయన్స్ రిటైల్లో ప్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) విలీనవివాదానికి సంబంధించి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఊరట లభించింది. అమెజాన్కు అనుకూలంగా అత్యవసర ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని, భారత చట్టాల ప్రకారం వాటిని అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో రూ.24,731 కోట్ల వ్యూచర్, రిలయన్స్, డీల్కు బ్రేక్ పడినట్లుయింది. ప్యూచర్ కూపన్స్లో వాటాదారైన అమెజాన్కు ఎఫ్ఆర్ఎల్లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయి.
మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలకు రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ప్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకంటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ప్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ప్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్డి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా వాటిపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాల్ చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.






