భారతీయ అమెరికన్ కు కీలక పదవి…

అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం) విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్ ఆహూజా వ్యవహరించనున్నారు. 20 లక్షల మందికి పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలను ఓపీఎం చూస్తుంది. 49 ఏళ్ల కిరణ్ అహూజామ ఓపీఎం హెడ్గా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్పై సెనేట్లో హోరాహోరీ ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో 50-50 ఓట్లు పడ్డాయి. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిరణ్కు మద్దతుగా ఓటేశారు. దీంతో కిరణ్ పదవి ఖరారైంది.
కీలకమైన ఓటింగ్లలో ఉపాధ్యక్షురాలి హోదాలో కమలా హ్యారిస్ ఇలా తన ఓటును వినియోగించుకోవడం ఏడాదికాలంలో ఇది ఆరోసారి కావడం విశేషం. ప్రజాసేవలో, దాతృత్వ కార్యక్రమాల్లో కిరణ్కు రెండు దశాబ్దాలకు పైగా అపార అనుభవముంది. గతంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోనై కిరణ్ ఓపీఎంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇకమీదట ఆమె ఓపీఎం అధినేతగా అద్భుత పనితీరు కనబరుస్తారు అని సెనేటర్ డ్యానీ ఫెయిన్ స్టెయిన్ కీర్తించారు.