న్యూజెర్సిలో జెండా ఎగురవేసిన విశ్వంజీ
న్యూజెర్సిలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సాయిదత్తపీఠంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వయోగి విశ్వంజీ ఈ కార్యక్రమంలో పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల, మాజీ మేజర్ కణ్ణన్, భక్తులు, ఇతరులు పాల్గొన్నారు.
