దావోస్ లో గణతంత్ర వేడుకలు
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియా ఇన్వెస్ట్ పెవిలియన్లో జాతీయ పతాకాన్ని ఆవ్కిరించారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.
