తానా మహాసభల్లో ఎన్టీఆర్ మ్యూజియం ప్రారంభం
సెయింట్లూయిస్లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 21వ మహాసభల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను నందమూరి కళ్యాణ్రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపి వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దర్శకుడు కే. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
