ప్రకాశం జిల్లాలో నాటా సేవాడేస్
ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) మాతృరాష్ట్రంలో నిర్వహిస్తున్న సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న బొమ్మరిల్లు శరణాలయాన్ని నాటా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా శరణాలయానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు నాటా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల, ఆళ్ళ రామిరెడ్డి, శ్రీనివాస్ ఈమని, నారాయణరెడ్డి గండ్ర తదితరులు పాల్గొన్నారు.
