డల్లాస్ వచ్చిన భూమన కరుణాకర్, వైవి సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డల్లాస్ పర్యటనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి డల్లాస్ వచ్చారు. డిఎఫ్డబ్ల్యు ఏర్పోర్టులో వారికి వైఎస్ఆర్సీపి నాయకులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డల్లాస్ వచ్చిన సంగతి తెలిసిందే.
