కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి అలాంటి ఉండవు
సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులు విక్రయించే డీలర్ల కు మొబైల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అంతేగాక, బల్క్ (ఎక్కువ మొత్తంలో) సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం కొందరు సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. ఇకనుంచి అలాంటివి ఉండవు. సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ను తప్పనిసరి చేస్తున్నాం. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నాం అని కేంద్ర మంత్రి వెల్లడిరచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని, వారంతా పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు.






