నీల్సన్ సీఈవోగా భారతీయుడు
అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయు సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్కు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు. ఆయన నిమామకం తక్షణం అమల్లోకి వచ్చింది. 2018 నుంచి సీఈవోగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదోన్నతి పొందారు. కార్తీక్ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలలోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదవిన కార్తీక్ రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు.






