జీ20కి ముందు కీలక నిర్ణయం..
అరడజను అమెరికా ఉత్పత్తులపై భారత్ అదనపు సుంకాలను ఎత్తివేసింది. వీటిలో శెనగలు, ఉలవలు, యాపిళ్లు, వాట్నట్స్, బాదం ఉన్నాయి. 2019లో భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను పెంచింది. దీనికి బదులుగా పలు ఉత్పత్తులపై భారత్ సైతం అదనపు సుంకాలు విధించింది. వాటిలో కొన్నింటికి తాజాగా మినహాయింపునిచ్చింది. జీ20 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడిరది. ప్రధాని మోదీ జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు ఆరు అంశాల్లో నెలకొన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అందులో తాజాగా రద్దు చేసిన అదనపు సుంకాల అంశం సైతం ఉంది.






