సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను.. వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ ఫిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడిరచారు. దీనికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు.