తెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడిరచారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యారు. తమ సంస్థకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని, తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు జేమ్స్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు వివరించారు.
కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేస్తుంది. సిద్దిపేటలోని ప్లాంట్ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్లో అదనంగా రూ.647 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వరంగల్ లేదా కరీంనగర్లో రెండో తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది కోకా కోలా. కోకాకోలా తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రాతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.






