నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసిలోని కాలభైరవుడికి పూజలు చేసిన అనంతరం ఆయన కలెక్టరు కార్యాలయానికి చేరుకొని నామపత్రాలు సమర్పించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పలువురు ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.






