Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Mou for historic google ai hub to be signed in delhi tomorrow

Nara Lokesh: చారిత్మాత్మక గూగుల్ ఎఐ హబ్ కు రేపు డిల్లీలో అవగాహన ఒప్పందం

  • Published By: techteam
  • October 13, 2025 / 04:50 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Mou For Historic Google Ai Hub To Be Signed In Delhi Tomorrow

చంద్రబాబు బ్రాండింగ్, లోకేష్ నిరంతర కృషితో అతిపెద్ద పెట్టుబడి
గూగుల్ రాకతో ఎఐ సిటీగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నం
మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలోనే సంస్థ ప్రతినిధులతో తొలిచర్చలు
రాష్ట్రానికి భారీ ఆదాయంతోపాటు యువతకు 1.88లక్షల ఉద్యోగావకాశాలు

Telugu Times Custom Ads

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజ్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఎపి చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఎఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయుపై న్యూ ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)గా రికార్డు సృష్టించబోతోంది. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం.

రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తరువాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి AI సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సంస్థ రాబోయే అయిదేళ్లలో (2026–2030 మధ్య) సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్థాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే, ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నొవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వ్యాపార అనుకూల విధానాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి ఎఐ ఎక్సలెన్స్ సెంటర్ గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం.

గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. విశాఖలో ఏర్పాటుచేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ (AI) వ్యవస్థను అమలు చేసి, భారతదేశంలో AI ఆధారిత ట్రాన్సఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త AI హబ్ లో అత్యాధునిక AI మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయపరచి, విశాఖపట్నాన్ని భారతదేశ AI ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్బ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదం పొందింది. ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులను ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు.

 

 

 

Tags
  • Chandrababu
  • Delhi
  • Google AI Hub
  • MoU
  • Nara Lokesh

Related News

  • Google Landmark Investment In Andhra Pradesh

    Chandrababu: ఇది ఏపీకే కాదు … దేశానికే గర్వకారణం : చంద్రబాబు

  • Cm Chandrababu Naidu Inaugurated Crda Headquarters In Amaravati

    CRDA:సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Kurnool Nimmala Ramanaidu Comments On Jagan

    Minister Nimmala : సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సక్సెస్‌ విజయవంతం చేయాలి : మంత్రి నిమ్మల

  • Chittoor Hyderabad Ngo Donated 75 Lakh Rupees To Ttd

    TTD: టీటీడీకి రూ. 75 లక్షల విరాళం

  • Ministerial Post For Balakrishna

    Balakrishna: బాలకృష్ణకు మంత్రి పదవి..! పెరుగుతున్న డిమాండ్!!

  • Us Based Nri Group To Develop It Park Near Tirupati

    Pelican Valley: తిరుపతిలో … పెలికాన్‌  వ్యాలీ!

Latest News
  • Trump: గాజా పోరు ముగిసింది.. ఇక పాక్-అఫ్గాన్ యుద్ధం సంగతి చూస్తామన్న ట్రంప్..
  • Lahore: రణరంగమైన లాహోర్ వీధులు.. నెత్తురోడిన టీఎల్పీ భారీ ర్యాలీ..!
  • Telusu Kada: ‘తెలుసు కదా’ యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్టైనర్: సిద్ధు జొన్నలగడ్డ
  • Delhi: గూగుల్ మ్యాప్స్ కు పోటీగా మ్యాపుల్స్.. స్వదేశీ యాప్ కు కేంద్రం మద్దతు..!
  • K-Ramp: “K-ర్యాంప్”లో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కు లోటు ఉండదు, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీని ఎంజాయ్ చేస్తారు – డైరెక్టర్ జైన్స్ నాని
  • Sankranthiki Vasthunnam: బాలీవుడ్ లో సంక్రాంతికి వ‌స్తున్నాం రీమేక్.. హీరో ఎవ‌రంటే?
  • TANA: న్యూజెర్సీ లో తానా–గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్
  • Pakistan: సౌదీతో ఒప్పందంపై పాక్ గొప్పలు పోయిందా…? అఫ్గనిస్తాన్ దాడి చేసినా రియాక్షన్ లేదే..?
  • Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్
  • Devara: ఏడాది త‌ర్వాత టీవీలోకి రాబోతున్న దేవ‌ర‌
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer