Kakinada Port: కాకినాడ పోర్టుకు ప్రమాద హెచ్చరిక జారీ
మొంథా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖ (Visakhapatnam) లోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టు (Kakinada Port) కు పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం(Visakhapatnam) , గంగవరం పోర్టులకు 9, మచిలీపట్నం (Machilipatnam), నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.







