Srivari Temple: రాజధానిలోని శ్రీవారి ఆలయానికి రెండో ప్రాకారం
రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) వేంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 10:55 నుంచి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల మాదిరిగా ఇక్కడ కూడా రెండో ప్రాకారం రూపుదిద్దుకోనుంది. పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో 5 అంతస్తులతో గాలి గోపురాలు, తూర్పు వైపున 7 అంతస్తులతో మహా రాజగోపురం (Maharajagopuram) నిర్మించనున్నారు. అంతర్భాగంలో మహా రాజగోపురానికి అభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు మొదలైనవి రానున్నాయి.






