RBI: ఈ నెల 28న 25 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు శంకుస్థాపన :నిర్మలా సీతారామన్
రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ఆర్బీఐ(RBI) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈనెల 28న నేలపాడులో ఆర్బీఐకి కేటాయించిన 3 ఎకరాల స్థలంలో భూమిపూజ చేయనున్నారు. అలాగే, మరో 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వరంగ బ్యాంకుల నూతన భవనాలకు ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన షెడ్యూల్ విడుదలయింది. కాగా, ఈ నెల 28న శంకుస్థాపనల కార్యక్రమాల సందర్భంగా సీఆర్డీఏ కార్యాలయం వద్ద భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), సీఎం చంద్రబాబు (CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారు.






