Mukesh Ambani : ముకేశ్ అంబానీ కీలక ప్రకటన …వారికి ఉచిత చికిత్స

జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తీవ్రంగా ఖండిరచారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన రిలయన్స్ (Reliance) తరపున తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన సర్ హెచ్ఎన్ హాస్పిటల్ (HN Hospital ) లో ఉచితంగా చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఉగ్రవాదం మానవాళికే మచ్చ అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రధాని మోదీ (Prime Minister Modi), భారత ప్రభుత్వానికి రిలయన్స్ అండగా ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.