Chandrababu: ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు … మన జీవన విధానం కావాలి : చంద్రబాబు
ఏడాది క్రితం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. చిత్తూరు జిల్లా (Chittoor district) నగరిలో సీఎం పర్యటించారు. స్వర్ణాంధ్ర(Swarnandhra)- స్వచ్ఛాంధ్ర (Swachh Andhra) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు.






