కేంద్రం కీలక నిర్ణయం… అంతర్జాతీయ విమానాలపై

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించించి నిషేదం కొనసాగుతుందని పేర్కొంది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని చెప్పింది. అలాగే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ ప్రయాణ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ వెల్లడించింది.