MiG 21: మిగ్ 21కు గుడ్బై : ఏపీ సింగ్

భారత వాయుసేనకు కొన్ని దశాబ్దలుగా ఎన్నముకలా ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21 (MiG 21) కు వాయుసేవ చీఫ్ ఏపీ సింగ్ (AP Singh) వీడ్కోలు పలికారు. చండీగఢ్ (Chandigarh) వాయుసేన కేంద్రం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) , ఐఏఎఫ్ సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు. ఈ రకం విమానం భారత్లో తొలిసారి అడుగుపెట్టింది కూడా ఈ ఎయిర్పోర్స్ స్టేషన్లోనే కావడం విశేషం. నాడు ఫస్ట్ సూపర్ సోనిక్స్గా వ్వవహిరించే 28వ స్కాడ్రన్కు వీటిని మొదటిసారి అప్పగించారు. వింగ్ కమాండ్ దిల్బాగ్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు. ఇక మిగ్ 21లు కూడా దాదాపు 60 ఏళ్లుకు పైగా వాయుసేనకు సేవలు అందించాయి.