ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాబోతోంది. ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని అగ్ర నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. మహారాష్ట్ర, హర్యానాల్లో గెలిచేందుకు మంచి అవకాశాలున్నా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడానికి కారణాలు ఏమిట? లోపాలు ఎక్కడున్నాయ్? అనే అంశాలు సీడబ్ల్యూ సమావేశంలో చర్చకు రానున్నాయి. అదేవిధంగా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ఈ మధ్య కాంలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలను చవిచూసింది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి.