వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి.. బుల్ డోజర్స్

విపక్ష ఇండియా కూటమి పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఆ కూటమి ఎన్నికల బరిలో ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి రోజున రామమందిరం పై ఎస్పీకి చెందిన ఓ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ`కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్లల్లాను మళ్లీ టెంట్లోకి తీసుకొస్తారు అని మోదీ దుయ్యబట్టారు.