Sudarshan Patnaik: సుదర్శన్ పట్నాయక్కు శాండ్ మాస్టర్ పురస్కారం
ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Patnaik )ను ప్రతిష్ఠాత్మక ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ (British Sand Art Master Award) -2025ను గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్ (England)లోని వేమత్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్న సుదర్శన్ ప్రపంచ శాంతి సందేశంతో 10 అడుగుల ఎత్తయిన వినాయకు (Vinayaka Statue) ని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో ఆయన సృష్టించిన కళాఖండం తొలిస్థానాన్ని దక్కించుకోవడంతో కార్యక్రమ నిర్వాహకులు పట్నాయక్ను అవార్డుతో సత్కరించారు.







