Indians: 25 మంది భారతీయులకు మరణశిక్ష
యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ)లో 25 మంది భారతీయుల (Indians) కు మరణ శిక్ష విధించారని, అయితే తీర్పు ఇంకా అమలు కావలసి ఉందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభ (Rajya Sabha ) లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh ) లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. విదేశాల్లో ఎంత మంది కారాగారాల్లో మగ్గుతున్నారు, ఎంత మందికి మరణ శిక్ష (Death penalty ) విధించారు అని అడిగిన ప్రశ్నకు జావాబిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడిరచారు. వారి ప్రాణాలు కాపాడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా అన్నారు. మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విదేశీ జైల్లో ప్రస్తుతం విచారణలో ఉన్న ఖైదీలలో భారతీయ ఖైదీల సంఖ్య 10152 అని ఆయన తెలిపారు.






