Blood Roses: “బ్లడ్ రోజస్” ట్రైలర్ ను విడుదల చేసిన నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.
బ్లడ్ రోజస్ టీజర్ ను చూసి నటుడు సుమన్, నటుడు అజయ్ ఘోష్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. టీజర్ ఆసక్తికంగా ఉందని, త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని వారు కోరారు.

ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా, సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.
ఈ సందర్భంగా నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
బ్లడ్ రోజస్ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను, మంచి థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమాతో డైరెక్టర్ ఎంజిఆర్ , నిర్మాత హరీష్. కె కు అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్స్ టెక్నీషియయన్స్ కు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్న అన్నారు.
బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ ఒగి రెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఎం.జి మూవీస్ ద్వారా అచ్చిబాబు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.






