2011 నాటి ఆ ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోను

ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమెరికా మట్టబెట్టి, పది సంవత్సరాలు అవుతుండగా, నాటి ఘటనను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. నాటి ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోబోనని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై దాడికి కుట్ర చేయడం ద్వారా ప్రపంచాన్ని వణికించారు. అంతకు ఎన్నో ఏళ్లకు ముందే వేయాల్సిన శిక్షను ఆ రోజు వేశామని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించే ప్రయత్నాలను ప్రారంభించామని అన్నారు. పాకిస్థాన్లో లాడెన్ తలదాచుకున్నాడని గుర్తించిన అప్పటి అమెరికా ప్రభుత్వం, స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, లాడెన్ ను హతమార్చిన సంగతి తెలిసిందే.