Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు : రాజ్నాథ్ సింగ్

రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు మన ఎగుమతులపై అమెరికా (America) 50 శాతం సుంకాల భారం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు భారత్ (India) నేరుగా స్పందించలేదు. ఈ విషయమై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. విశాల దృక్పథం, గొప్ప మనసు ఉన్నవారు ఏ విషయంపైనైనా వెంటనే స్పందించరు అని బదులిచ్చారు. మొరాకో పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ అక్కడి ప్రవాస భారతీయుల (Indians) తో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.