Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Gollapalli surya rao vs gollapalli amulya in razole

Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!

  • Published By: techteam
  • September 23, 2025 / 11:40 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Gollapalli Surya Rao Vs Gollapalli Amulya In Razole

కోనసీమ జిల్లాలోని రాజోలు (Razole) నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి గొల్లపల్లి సూర్యారావు (Gollapalli Suryarao) వైసీపీ (YSRCP) ఇన్‌చార్జ్‌గా ఉంటుండగా, ఆయన కుమార్తె గొల్లపల్లి అమూల్యను (Gollapalli Amulya) తెలుగుదేశం పార్టీ (TDP) ఇన్‌చార్జ్‌గా నియమించింది. దీంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారతున్నాయి. TDP రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అమూల్యను టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీంతో ఇది కేవలం పార్టీల మధ్య పోరు కాకుండా, తండ్రి-కూతురు మధ్య రాజకీయ సవాల్‌గా మారింది.

Telugu Times Custom Ads

గొల్లపల్లి సూర్యారావు 1981లో కొత్తపేట సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత TDPలో చేరి, 2014-2019 మధ్య రాజోలు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. TDPలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ 2024 ఎన్నికల సమయంలో TDP-జనసేన కూటమి రాజోలు సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన అసంతృప్తి చెందారు. దీంతో TDPకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో YSRCP తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.

గొల్లపల్లి అమూల్య రాజకీయ ప్రయాణం తండ్రి వారసత్వంతోనే మొదలైంది. తండ్రి టీడీపీలో మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆమె నియోజకవర్గ కార్యక్రమాలు చూస్తూ వచ్చారు. 2024 ఎన్నికల ముందు తండ్రి వైసీపీలో చేరినా, అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు TDP అధిష్టానం ఆమెను రాజోలు ఇన్‌చార్జ్‌గా నియమించింది. అయితే తండ్రి వైసీపీలో ఉండగా, కుమార్తెను టీడీపీ ఇన్ ఛార్జ్ గా నియమించడం స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి రగులుతోంది. నిన్నటివరకూ తండ్రిబాటలోనే నడిచిన అమూల్యకు ఈ పదవి ఎలా ఇస్తారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

రాజోలు SC రిజర్వ్డ్ సీటు, 2019లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇది. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. అయినా 2024 ఎన్నికల్లో రాపాకకు సీటు దక్కలేదు. గొల్లపల్లి సూర్యారావును బరిలోకి దించింది వైసీపీ. తాము గెలిచిన ఏకైక స్థానం ఇదే కాబట్టి రాజోలు సీటు తమకే కేటాయించాలని జనసేన పట్టుబట్టడంతో టీడీపీ కాదనలేక పోయింది. ప్రస్తుతం ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలో బలపడాలని టీడీపీ భావిస్తోంది. అందుకే అమూల్యను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

అయితే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ఈ పార్టీల ఏకైక శత్రువు వైసీపీ మాత్రమే. కాబట్టి టీడీపీ ఇన్ ఛార్జ్ గా అమూల్య ఇప్పుడు తన తండ్రి గొల్లపల్లి సూర్యారావుపై పోరాటం చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు యాక్టివగా ఉంటున్నారు. కాబట్టి తండ్రిని అమూల్య ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది.

 

 

 

Tags
  • AP Politics
  • Gollapalli Amulya
  • Gollapalli Suryarao
  • tdp
  • Ysrcp

Related News

  • Lt Out Of Hyderabad Metro

    L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?

  • Fake Campaign Against Amaravati Gst Officer Suspended

    Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్

  • Nara Lokesh Speech At Vijayawada Utsav 2025

    Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్

  • China Floats K Visa As Trump Tightens H1 B Rules

    China: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!

  • Devinenis Successor As Bezawada Mayor Candidate

    Devineni: బెజవాడ మేయర్ అభ్యర్ధిగా దేవినేని వారసుడు..?

  • Ed Will Arrest Both Of Them

    Liquor Scam: ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయనున్న ఈడీ..?

Latest News
  • L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
  • Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
  • Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
  • NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాల‌య్య మూవీ?
  • OG: ప‌వ‌న్ టార్గెట్ అదేనా?
  • ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
  • PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
  • TANA: ఛార్లెట్‌లో ఘనంగా తానా 5కె రన్‌…
  • Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
  • Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer