భారత్-పాక్ సంబంధాలపై.. అగ్రరాజ్యం ఏమన్నదంటే?
అనేక అంశాల్లో భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని ఆగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్-పాక్ సంబంధాలపై స్పందిస్తూ ఉగ్రవాదం ఉన్నంతకాలం శత్రుదేశంతో చర్చలు జరపలేమని భారత్ చెప్పిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మరోసారి గుర్తు చేసింది. భారత్-పాక్ మధ్య ఉగ్రవాదం అంశం ప్రధానంగా కొనసాగుతోంది. ఏ దేశమైనా వారి పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటే స్వాగతిస్తాం. కానీ, ఉగ్రవాదం విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. భూమి మీద ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ దేశమైనా ఖండించాల్సిందే అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాలు, భద్రతా సహకారంతో పాటు పలు రంగాల్లో భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామన్నారు.






